పప్వా న్యూగునియాలో భూకంపం

- March 30, 2018 , by Maagulf
పప్వా న్యూగునియాలో భూకంపం

రాబౌల్: పప్వా న్యూగునియాలో 6.9 తీవ్రతతో ఇవాళ భూకంపం సంభవించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా సమాచారం లేదు. రాబౌల్‌కు 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పడు ఎంగ్వా ప్రావిన్సులో సుమారు 100 మంది మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com