నా దుస్తులు లాగేయమన్నారు : విద్యార్థిని

- March 31, 2018 , by Maagulf
నా దుస్తులు లాగేయమన్నారు : విద్యార్థిని

ఢిల్లీలోని జేఎంయూ విశ్వవిద్యాలయంలో మర్చి 23 న నిర్వహించతలపెట్టిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో కొంతమంది విద్యార్థినులను తీవ్రంగా కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రికి బెయిల్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారని, తన దుస్తులు కూడా లాగేయమని లేడీ పోలీసులకు అదజేశాలిచ్చారని సోషల్ మీడియా వేదికగా షీనా ఠాకూర్‌(24) అనే విద్యార్థిని వెల్లడించింది. అందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com