ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టిన ఆటా చికాగో

- April 09, 2018 , by Maagulf
ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టిన ఆటా చికాగో

అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా చికాగో ఫండ్ రైజింగ్ చేపట్టింది. జూన్ 29 నుంచి మూడు రోజుపాటు నిర్వహించే మహాసభలకోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ తెలంగాణ మహాసభలకు విరాళాలను అందించారు.  కన్వెన్షన్ కోసం 3లక్షల 50వేల డాలర్లు సేకరించినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. చికాగోలో జరిగిన ఈకార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ సత్య కందిమల్ల,  ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తోపాటు పలువురు పాల్గొన్నారు.  అనంతరం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com