నేటి నుంచి మోడీ స్వీడన్‌, బ్రిటన్‌లలో పర్యటన...

- April 16, 2018 , by Maagulf
నేటి నుంచి మోడీ స్వీడన్‌, బ్రిటన్‌లలో పర్యటన...

ప్రధాని మోడీ నేటి నుంచి స్వీడన్‌, బ్రిటన్‌లలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రాత్రి స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో నార్డిక్‌ దేశాలుగా పేరుగాంచిన స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. రేపు సాయంత్రం మోడీ బ్రిటన్‌ వెళ్లనున్నారు. బుధవారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. లండన్‌లోని చారిత్రక హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌ నుంచి మోడీ ప్రసంగించనున్నారు. గాంధీజీ తర్వాత మాట్లాడుతున్న రెండో భారతీయుడిగా మోడీ రికార్డు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com