ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా
- April 16, 2018మస్కట్: యూఏఈలోని దుబాయ్ లేదా అబుదాబీ మీదుగా ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసాలను మంజూరు చేయనుంది. ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణీకులు యూఏఈలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించే వీలుంది. యూఏఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో, ట్రాన్సిట్ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. యూఏఈలో టూరిజం సెక్టార్ని ప్రమోట్ చేసేందుకు, ఎకానమీని వృద్ధి చేసేందుకు ట్రాన్సిట్ వీసాలకు సంబంధించి కొత్త పాలసీని క్యాబినెట్ అప్రూవ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూఏఈ ఎయిర్ పోర్టుల ద్వారా 2017లో ప్రయాణించినవారిలో 70 శాతం మంది ట్రాన్సిట్ ప్రయాణీకులు. న్యూ పాలసీలో వీసా ఫీజు, స్టాప్ ఓవర్ విజిటర్స్ సంఖ్యను పెంచడం, అలాగే దేశంలోని టూరిజంని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత