ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా
- April 18, 2018న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ