ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికడదాం
- April 21, 2018మనామా: 42వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ సందర్భంగా 240 మంది ఔత్సాహికులు ప్లాస్టిక్ పొల్యూషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అల్ బదర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం 'స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్' నినాదంతో ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ భూతం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వినియోగం క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల్ని పరిరక్షించగలుగతామని వారు అభిప్రాయపడ్డారు. ఈ రేస్లో పాల్గొని విజేతలైనవారికి సర్టిఫికెట్లు అందజేశారు. గోల్డెన్ టులిప్ హోటల్లో ఈవెంట్ స్పాన్సరర్కి 'థ్యాంక్యూ లంచ్' ఏర్పాటు చేసినట్లు క్లబ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ