నేడే 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్
- April 21, 2018అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది టాగ్లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మిలిటరీ ఆఫీసర్గా దర్శనమీయనున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి.
కాగా నేడు (ఆదివారం) ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలో అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఈ సినిమా మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్