సౌదీ అధికారిక భవనం వద్ద పేలుడు
- April 21, 2018ఇస్తాంబుల్ : సౌదీ అరేబియా అధికార నివాసం వద్ద శనివారం సాయంత్రం పేలుడు జరిగిందని సోషల్మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై వివరణనిచ్చిన అధికారులు వారి అనుమతి లేకుండా అధికారిక నివాసం వద్ద డ్రోన్ను ప్రయోగిస్తున్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు తెలిపారు. భద్రతా దళాలు రియాద్కు సమీపంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనమైన అల్- ఖజోమా వద్ద ఒక డ్రోన్ను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో భద్రతా దళాలు దానిని పేల్చివేశాయని తెలిపారు. అయితే ఇది రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఒక బొమ్మ విమానం అని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యెమెన్ నుండి తరచుగా వచ్చే దాడుల నేపథ్యంలో సౌదీ భద్రతా దళాలు గట్టి భద్రతలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనంలో లేరని సౌదీ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు