వివాహ వేడుకపై వైమానిక దాడి: 20మంది మృతి
- April 23, 2018దుబాయి: సౌదీ అరేబియాలోని యెమన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం. సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన ఈ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను హజ్జాలోని అల్ జుమ్హౌరీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం