అసలే మ్యాచ్ పోయింది. ఆపై రూ.12 లక్షల ఫైన్
- April 26, 2018ఐపీఎల్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. అసలే మ్యాచ్ పోయిన బాధతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటే. మూలుగే నక్కపై తాటిపండు పడ్డ చందగా విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్ వేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసినా. 82 పరుగులతో అంబటి రాయుడు, 70 పరుగులతో ఎంఎస్ ధోనీ చెలరేగడంతో చెన్నై విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద కనీస ఓవర్-రేట్కు సంబంధించి కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించినట్టు ప్రకటించింది ఐపీఎల్.
తాజా వార్తలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్