జయ సమాధి తవ్వడం తప్పదా..?
- April 26, 2018జయలలిత తన తల్లినంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ దాఖలు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. అమృత పిటీషన్ ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు డీఏఎన్ పరీక్ష కోసం రక్తం వంటి బయాలాజికల్ (జీవ సంబంధిత) శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా అపోలో హాస్పిటల్స్ ను ఆదేశించింది. తమ వద్ద జయలలితకు సంబంధించిన బయలాజికల్ శాంపిల్స్ ఏవీ లేవని హాస్పిటల్ కోర్టుకు తెలిపింది. చాలా రోజుల తరవాత హాస్పిటల్ దాఖలు చేసిన అఫడవిట్ ఇపుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆమెకు సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో.. కోర్టు మున్ముందు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.జయ మృతికి సంబంధించి ఎలాంటి విచారణ వద్దని ఒకవైపు ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాధి తవ్వి ఆమె అవశేషాలు తీసి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశిస్తుందా? అన్న టెన్షన్ ఆమె అభిమానుల్లో నెలకొంది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు