అమరావతి సచివాలయ నిర్మాణానికి టెండర్లు
- April 27, 2018అమరావతి రాజధాని నిర్మాణంలో సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 5 టవర్లలో 69 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సచివాలయం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,176 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఏర్పాటు చేశారు.
జీఏడీ టవర్ (50 అంతస్థులు) నిర్మాణం వ్యయం 530 కోట్లు కాగా, 40 అంతస్థుల చొప్పున మిగిలిన నాలుగు టవర్లు నిర్మించనున్నారు. 1, 2 టవర్ల నిర్మాణ వ్యయం- 895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణ వ్యయం- 751 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 16 వరకు గడువు విధించారు. ప్రముఖ కంపెనీలు ఇంట్రెస్టుతో ఉన్నట్టు సమాచారం.
కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాకా ఇకపై పై నుండి ఎలాంటి సాయం ఉండదు అనే నిర్ధారణకు వచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే డబ్బులకు కటకటలాడుతున్నా ముందుకు పోవడమే అని నిర్ణయించుకుని ముందడుగు వేశారు. ఇప్పటికే నిధుల సమీకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్