ఫ్యామిలీతో మహేష్ పారిస్ టూర్
- April 30, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. సినిమా రిలీజ్కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్ మరోసారి అదే ప్రదేశానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సినిమా రిలీజ్ తర్వాత భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ వెళ్ళాడు. అక్కడ థియేటర్లో ఫ్యాన్స్తో కలసి సినిమా చూశాడు. రెండు ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చిన కారణంగా పలు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాడు మహేష్. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి వెళ్ళాడు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. తాను బ్రతికినంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటానని మహేష్ తెలిపిన విషయం విదితమే. త్వరలో వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మహేష్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ న్యూయార్క్లో జరగనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక