'మహానటి' చూడాలని ఉంది - బాలీవుడ్ నటి రేఖ
- May 15, 2018మహానటి సినిమా తరవాత అనేక ఆసక్తి కరమైన నాటి విషయాలు ఈ తరం యువతకు తెలుస్తున్నాయి. సావిత్రి జీవిత కథలో, సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 (బుధవారం)న విడుదలై ఘన విజయం సాధించింది. సినిమాకు ప్రముఖులే కాదు ప్రజలనుండీ అందరి ప్రశంసలు అందుతున్నాయి. అయితే మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా అలాగే అందరిని మించిన ఆత్రుత ఉంటుంది కదా! అయితే మహనటి సినిమాను చూడాలని ఉందని జెమిని గణేషన్ తో సహజీవనం చేసిన సినీనటి పుష్పవల్లి (జెమిని జీవితం లో జనానికి తెలిసిన రెండవ భార్య వివాహం చేసుకున్న వివరాలు తెలియదు) కుమార్తే బాలీవుడ్ ప్రఖ్యాత సీనియర్ నటి రేఖ అన్నారు.
ఇది తన పిన్ని కథ అని, తన తండ్రి గురించి కూడా సినిమాలో ఉందని, అందుకే సినిమా చూడాలని కొరుకుంటున్నాని చెప్పుకొచ్చింది. నాన్న ఙ్జాపకాలు నెమఱువేసుకునే అవకాశం కలుగుతున్ దన్నారు. మొదట తన సవతితల్లి సావిత్రి జీవితకథపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, తన తండ్రి గురించి ఎక్కడ చేడుగా చూపిస్తా రనే భయం తనకు ఉండేదని చేప్పిందట రేఖ. తరువాత కొంతకాలం ఆగి చూద్ధామనుకుందట. అందుకే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉండిపోవాలనుకుందట. ఇప్పుడు మళ్లీ సినిమా చూడాలని ఉందని ఆమె ముంబై లో పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత తన స్వంత సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని నిర్మాతలకు రేఖ తెలియజేసిందని సమాచారం. జీవితం విషయం లో రెఖ జీవిత చరిత్ర మహానటికి ఏమాత్రం తీసిపోదు. నటనలో కూడా రేఖ హిమోన్నతమే. జీవితమంతా ఒడిదుడుకులు బాల్యం అనిశ్చితం. వృత్తిలో మలుపులనేకం జీవితంలో కూడా అంతే. బయోపిక్ తీస్తే ఈమె జీవితం కూడా మహనటిని మించిన గొప్ప చిత్రంగా రూపొందించ వచ్చంటారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్