'నా నువ్వే' ట్రైలర్‌ విడుదల

- May 15, 2018 , by Maagulf
'నా నువ్వే' ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'నా నువ్వే'. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం ఇది. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా..ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. సాధారణంగా ప్రేమ కథల్లో హీరో అమ్మాయి కోసం పరితపిస్తుంటాడు. కానీ ఇందులో తమన్నా..కల్యాణ్‌ రామ్‌ ప్రేమ కోసం తపించడాన్ని ట్రైలర్‌లో అందంగా చూపించారు. ప్రేమ, యాక్షన్‌, కామెడీ ప్రధానంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

'తపించే క్షణాలకు..నిరాశే చూపించకు..నా నువ్వే' అంటూ వచ్చే సంగీతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో.. కల్యాణ్‌ రామ్‌ వేరే ప్రదేశానికి వెళుతుంటే..'వెళ్లండి..కలుద్దాం' అని తమన్నా అంటుంది. ఇందుకు పక్కనే ఉన్న వెన్నెల కిశోర్‌..'ఇదేం ట్విస్ట్‌ బావా..జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది' అనడం నవ్వులు పూయిస్తోంది.

ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్‌ కెమెరా పనితనం, షరత్‌ సంగీతం ఆకర్షణీంగా ఉన్నాయి. కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పిస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. మే నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com