బోటులో పెళ్లి బృందం...40 అడుగుల లోతులో బోటు...
- May 16, 2018దాదాపు 15గంటలు పూర్తి కావొస్తోంది. ఇంత వరకు ఒక్కరి ఆచూకీ కూడా లేదు. తమ వారు ఉన్నారా? చనిపోయారా? బోటు కింద మునిగి జలసమాధి అయ్యారా? తెలియదు. అసలు బతికున్నారా? లేదా అంటూ బాధితుల బంధువులు విషాదంలో మునిగిపోయారు. గోదావరి నదిలో లాంచీ బోల్తా పడిన ఘటనపై ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడ్డుకి కొంచెం దూరంలోనే బోటు మునిగిపోయిందని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు.. దాన్ని పైకి లేపి ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నీటి అడుగున సుమారు 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు పోలవరం నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పిస్తున్నారు. మరోవైపు అందులో ఉన్నవారి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో చిన్న చిన్న బోట్లతో గోదావరిలో ముమ్మర గాలింపు జరుపుతున్నారు. మరోవైపు నేవీ హెలికాప్టర్లు, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి.
లాంచీ బోల్తా ప్రమాదంతో కొండమొదలు, గొందూరు, తల్లోరు, మంటూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బోటులో ఉన్నవారంతా ఈ గ్రామాల వారే. బోటులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో లాంచీ బోల్తా పడగానే 16 మంది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేశారు. మిగిలిన 36 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. అందులో పెళ్లి బృందం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో తమ వారి ఆచూకీ కోసం గ్రామాల్లో ప్రజలు భారీగా ఘటన స్థలానికి తరలివస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని వారంతా విషాదంలో మునిగిపోయారు.
మంటూరు లాంచీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గాలింపు చర్యలు, సహాయక చర్యల మీద ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఘటన స్థలానికి బయలుదేరనున్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..