హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బాధితుల కోసం నిధి

- May 25, 2018 , by Maagulf
హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బాధితుల కోసం నిధి

మనామా:మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ నార్త్‌ ఆఫ్రికా రీజినయన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా బహ్రెయిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బాధితుల కోసం నిధి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. క్రౌన్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బాధితులకు అండగా వుండేందుకోసం, అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఖర్చుల కోసం బాధితులకు అండగా వుండేందుకు ఈ నిధి ఉపయోగపడ్తుంది. బాధితులకి మళ్ళీ బహ్రెయిన్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ దక్కేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ నిధి నుంచి ఇద్దరు బాధితులకు సహాయం అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com