దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు
- May 26, 2018మస్కట్: మెకును తుపాను నేపథ్యంలో మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, మూడు రోజులపాటు అధికారిక సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే ఈ సెలవుల నుంచి కొన్ని శాఖలకు మినహాయింపునిచ్చారు. మరోపక్క, ప్రైవేటు సంస్థలకు సైతం సెలవుల్ని ప్రకటించారు. తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, తుపాను మిగిల్చిన బీభత్సం నుంచి తేరుకోవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు