దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు

- May 26, 2018 , by Maagulf
దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు

మస్కట్‌: మెకును తుపాను నేపథ్యంలో మెజెస్టీ సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌, మూడు రోజులపాటు అధికారిక సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఉద్యోగులకు ఈ లీవ్‌ వర్తిస్తుంది. అయితే ఈ సెలవుల నుంచి కొన్ని శాఖలకు మినహాయింపునిచ్చారు. మరోపక్క, ప్రైవేటు సంస్థలకు సైతం సెలవుల్ని ప్రకటించారు. తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, తుపాను మిగిల్చిన బీభత్సం నుంచి తేరుకోవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com