'దాస్‌ కాపిటల్‌' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!

- May 26, 2018 , by Maagulf
'దాస్‌ కాపిటల్‌' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!

కమ్యూనిస్ట్ మేధావి కారల్ మార్క్స్‌ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన రాసిన 'దాస్‌ కాపిటల్‌' రాత ప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లు) పలికింది. మార్క్స్‌ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 3న చైనాలోని బీజింగ్‌లో ఈ రాత ప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్‌ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్‌లో దాస్‌ కాపిటల్‌ కోసం మార్క్స్‌ తయారు చేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్‌లుంగ్‌ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com