ఘనంగా ప్రారంభమైన మహానాడు

- May 27, 2018 , by Maagulf
ఘనంగా ప్రారంభమైన మహానాడు

తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు , నేతలు ఎంతో ఘనంగా జరుపుకునే మహానాడు వేడుక ఈరోజు విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి కూడా భారీగా కార్య కర్తలు , అభిమానులు చేరుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది.

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్‌, ఫోటో ప్రదర్శన ప్రారంభించి.. తిలకించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. రక్తదాతలను అభినందించారు.మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాల్లో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మహానాడు సందర్భంగా విజయవాడ నగరం అంత పసుపు మాయంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com