ఘనంగా ప్రారంభమైన మహానాడు
- May 27, 2018తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు , నేతలు ఎంతో ఘనంగా జరుపుకునే మహానాడు వేడుక ఈరోజు విజయవాడలోని కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి కూడా భారీగా కార్య కర్తలు , అభిమానులు చేరుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది.
మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫోటో ప్రదర్శన ప్రారంభించి.. తిలకించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. రక్తదాతలను అభినందించారు.మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాల్లో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మహానాడు సందర్భంగా విజయవాడ నగరం అంత పసుపు మాయంగా మారింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన