రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తాయిలాలు..

- June 01, 2018 , by Maagulf
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తాయిలాలు..

తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేయనున్నారు. 50 వేల కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలు 18,428 ఉండగా, వివిధ శాఖల్లోని మరో 32 వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. అవి..
*  విద్యుత్ శాఖలో 13 వేల పోస్టులు
*  సింగరేణిలో 7 వేల పోస్టులు
*  గ్రూప్ -1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లు
*  జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీవోలు కలిపి 200 నుంచి 300 పోస్టులు
*  రెవెన్యూ శాఖలో 1237 పోస్టులు. వీటిలో 217 జూనియర్ అసిస్టెంట్, 292 టైపిస్ట్, 13 సీనియర్ స్టెనో, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు.
*  సివిల్ ఎస్సైలు 710, సివిల్ కానిస్టేబుళ్లు 5,909
*  ఏఆర్ కానిస్టేబుళ్లు 5,273
*  4,816 టీఎస్‌ఎస్పీ (పురుషులు)
*  485 టీఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com