అగ్ని పర్వతం పేలి 25 మంది దుర్మరణం

- June 04, 2018 , by Maagulf
అగ్ని పర్వతం పేలి 25 మంది దుర్మరణం

గ్వాటెమల:మధ్య అమెరికా దేశమైన గ్వాటెమలలోని ఫ్యూగో అగ్ని పర్వతం పేలింది. దీంతో 25 మంది మృత్యువాత పడ్డారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించారు. నదిలా ప్రవహిస్తున్న లావా చుట్టుపక్కల ప్రాంతాలను దహించి వేసింది. ఆకాశంలో పది కిలోమీటర్ల ఎత్తున దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం పేలడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com