మసులా ఫెస్టివల్తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బందరు
- June 12, 2018మచిలీపట్టణం:కృష్ణా జిల్లా మంగినపూడిలో నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్తో అంతర్జాతీయంగా బందరు పట్టణ పేరు మరోమారు మారుమోగిందని రాష్ట్ర న్యాయ, యువజన సర్వీసులు, క్రీడల శాఖామంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మచిలీపట్నం ఆర్అండ్బి అతిథిగృహంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్కు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు వచ్చారన్నారు. విదేశీయులు సైతం ఈ బీచ్ ఫెస్టివల్ చూసి ముగ్దులయ్యారని చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న 160 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంగినపూడి బీచ్ రోడ్డు మిగిలిన పనులు రూ.20కోట్లతో త్వరలో చేపడతామనీ, జిల్లాపరిషత్ గెస్ట్హౌస్నూ నిర్మిస్తామనీ చెప్పారు. బీచ్కు వచ్చే యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలూ కల్పించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. ఫెస్టివల్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..