అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

- June 13, 2018 , by Maagulf
అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్, అమెరికాలో రైలు కిందపడి ఆత్మహత్య పాల్పడ్డాడు. దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల కుమారుడు దీపక్‌. ఎంఎస్‌ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురయ్యేవాడని తెలుస్తుంది. టెక్సాస్ బిమౌంటులో రైలు కిందపడి దీపక్ సూసైడ్ చేసుకున్నట్లు అమెరికా నుంచి బంధువులకు సమాచారం అందింది. దీంతో పామూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com