4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్‌' ప్రదర్శన

- June 13, 2018 , by Maagulf
4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్‌' ప్రదర్శన

సౌదీ అరేబియా:సిరియన్‌ అమెరికన్‌ దర్శకుడు ముస్తాఫా అక్కద్‌ రూపొందిన చారిత్రక చిత్రం 'ది మెసేజ్‌' నాలుగు దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ప్రదర్శితం కాబోతోంది. తన తండ్రి రూపొందించిన సినిమా విడుదలవుతున్నందుకు ఆనంంగా వుందని అక్కద్‌ కుమారుడు చెప్పారు. ప్రొఫెట్‌ మొహమ్మద్‌పై తీసిన ఈ సినిమా 1976లో విడుదలై అరబ్‌ ప్రపంచంలో సంచలనమే సృష్టించింది. సినిమా చుట్టూ వివాదాలు రావడంతో, అరబ్‌ ప్రపంచం ఈ సినిమాని బ్యాన్‌ చేసింది. గత ఏడాది సౌదీ అరేబియా సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో, సౌదీ అరేబియాలో సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సినిమాపై ఎన్ని వివాదాలున్నా, ఇది ప్రజాదరణ పొందిందని అక్కద్‌ కుమారుడు మాలిక్‌ ముస్తఫా అక్కద్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com