ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించిన ఏపీ సీఎం
- June 16, 2018ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన ఆయన.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్తో భేటీ అయ్యారు. ఏపీ భవన్కు వచ్చిన ఈ ముగ్గురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు.. చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రశ్నించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎలా వ్యవహరించాలన్నది ప్రధానంగా చర్చిస్తున్నారు.
అటు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను పరామర్శించనున్నారు ముఖ్యమంత్రులు. ఆయన పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. కేజ్రీవాల్ను కలవడానికి ఇప్పటికే ఎల్జీ కార్యాలయం అనుమతిని కోరారు మమతా బెనర్జీ. అయితే... ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో.. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. ఆయన సతీమణిని కలిసి సానుభూతి వ్యక్తం చేయనున్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు