స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన దుబాయ్ పోలీస్
- June 22, 2018దుబాయ్ పోలీస్, స్మార్ట్ మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మురాక్కాబాత్ పోలీస్స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యూఏఈలో ఇది తొలి ప్రాజెక్ట్ అని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. 2016-21 స్ట్రాటజిక్ ప్లాన్లో భాగంగా దుబాయ్ పోలీస్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టిందని అన్నారు. రికార్డ్ టైమ్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారాయన. ఈ ప్రాజెక్ట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కార్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు