ఫేక్ బాంబ్: బహ్రెయినీ టీనేజర్కి జైలు
- June 22, 2018హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ యువకుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సోదరుడితో కలిసి ఫేక్ బాంబు తయారీలో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. 2016, మే 22న జిద్ అలి ప్రాంతంలో ఓ డివైజ్ని కనుగొన్నారు. ఈ హోక్స్ బాంబ్ని ప్లాస్టిక్ బాక్స్తో తయారు చేశారు. ఎంపీ3 గ్యాడ్జెట్తో కనెక్ట్ చేసి, టేప్ చేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. జిద్ అలి ప్రాంతంలో ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతంలో ఆ ఫేక్ బాంబ్ని పెట్టి, జనాన్ని భయపెట్టాలనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. తీవ్రవాద భావజాలంతోనే ఈ ఫేక్ బాంబ్ని నిందితుడు తయారు చేసినట్లు ప్రాసిక్యూటర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..