ఇథియోపియా:ప్రధాని ర్యాలీలో భారీ పేలుడు...
- June 23, 2018అడిస్ అబబా: ఇథియోపియా నూతన ప్రధాని అబే అహ్మద్ నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు చోటుచేసుకున్నది. అడిస్ అబబాలో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ సభలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని అబే అహ్మద్ను సెక్యూర్టీ దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. పేలుడులో అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రధాని హెయిలిమరియమ్ డిసలేన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు వారసుడిగా అబే అహ్మద్ ఆ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఒరోమో తెగకు చెందిన మొదటి నేతగా అబే అహ్మద్ను గుర్తిస్తున్నారు. ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజకీయ రెబల్స్ను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో జరిగిన పేలుడులో పలువురు చనిపోయినట్లు ఆ తర్వాత ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి