ఒకే ఇంట్లో11 మంది ఆత్మహత్య కేసులో తీవ్రంగా భయపడుతున్న పోలీసులు..
- July 10, 2018దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ రోజు వారందరు హత్యగావించారనే రూమర్లు రాగా మరోక రోజు వారు మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి ఈ విషయం తేల్చేందుకు పోలీసులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే మోక్షంపై ప్రీతీ ఉన్నప్పుడు వారు మాత్రమే చనిపోవాలి.. అలాంటప్పుడు అందర్నీ ఎందుకు చంపినట్టు, పైగా కుటుంబంలో అందరికి ఒకే అభిప్రాయం ఉండటం సాధ్యమేనా అనే కోణంలో కూడా పోలీసుల విచారిస్తున్నారు. ఇదిలావుంటే ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఈ కేసు విచారణ పనిలో పడి చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటం.. పైగా ఇంటిని చూస్తే ఏదో కీడు జరుగుతుందున్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే అని కొందరు పోలీసులు అంగీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం