సవాళ్ళను ఎదుర్కొంటున్న 'సాక్ష్యం'
- July 12, 2018యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ హిట్ రాకపోయినా వరసగా భారీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపపధ్యంలో ఈ నెల 27న విడుదల అవుతున్న 'సాక్ష్యం' సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ అందర్నీ ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ మెగా అక్కినేని కుటుంబాలకు చెందిన రెండు సినిమాలు పోటీ పడుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. నిహారిక సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ అదేవిధంగా సుశాంత్ హీరోగా నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ 'చి.ల.సౌ.' ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ బెల్లంకొండను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
పేరుకు ఈ సినిమాలు చిన్న సినిమాలే అయినా వీటి వెనుక ఇండస్ట్రీ పెద్ద కుటుంబాలు ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య పోటీ ధియేటర్స్ వార్ కు తెర తీస్తోంది. చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా మారిన 'సాక్ష్యం' మూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు.
తెలుస్తున్న సమాచారం మేరకు 'సాక్ష్యం' సినిమాకు 40 కోట్ల బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈసినిమాకు ఇంత సీన్ ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని 7 కోట్లకు కొనుకున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ మాన్ సూన్ ఫైట్ విజేత ఎవరు అనే విషయం పై ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు పెరుగుతున్నాయి..
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..