కేన్సర్ రోగులను పరామర్శించిన జగపతిబాబు
- July 15, 2018విజయవాడ: ప్రముఖ సినీనటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడలో పర్యటించారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ దశలో ఉన్న రోగులను జగపతిబాబు పలకరించారు. క్యాన్సర్ రోగులకు రూట్స్ ఫౌండేషన్ ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం జీవించే ఈ పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్ రోగుల బాధను పంచుకుని వారకి అండగా ఉంటున్న ఈ స్వచ్చంద సంస్థ సభ్యులు అభినందిస్తున్నట్టు చెప్పారు.
రోజులు లెక్కపెట్టుకుంటూ బతకడం ఎంత కష్టమో అందరికీ తెలుసని.. ఇలాంటి స్వచ్చంద సంస్థలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'సైరా' చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం తన షూటింగ్ను సర్దుబాటు చేసుకుని మరి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చివరి రోజులు గడుపుతున్న కేన్సర్ బాధితులకు అండగా నిలబడి సేవ చేస్తున్న రూట్స్ ఫౌండేషన్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జగపతిబాబు తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..