ఉగ్రవాద సంస్థల ఖాతాలు బ్లాక్ చేయనున్న ఫేస్‌బుక్‌

- July 17, 2018 , by Maagulf
ఉగ్రవాద సంస్థల ఖాతాలు బ్లాక్ చేయనున్న ఫేస్‌బుక్‌

పాకిస్తాన్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి మార్క్‌ జూకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను ప్రోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 25 నుంచి పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దు చేయాలని పాక్‌ ఎన్నికల కమిషన్‌ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్‌ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్‌ ఎకౌంట్లను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్‌ సయ్యద్‌ స్థాపించిన జమత్‌-ఉద్‌-దావా, ఇస్లామిక్‌ మల్లీ ముస్లిం లీగ్‌ (ఎమ్‌ఎమ్‌ఎల్‌) సంస్థలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తామని జూకర్‌బర్గ్‌ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com