ఇండియన్ బ్యాంకర్ యు.ఏ.ఈలో మృతి
- July 17, 2018యు.ఏ.ఈ:వారం రోజులుగా కన్పించకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి మృతదేహం వెలుగు చూసింది. గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో ఈ మృతదేహాన్ని భద్రపరచగా, సోషల్ వర్కర్స్, కమ్యూనిటీ గ్రూప్స్ మృతుడెవరన్నదాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం జరిగింది. కాగా, సోమవారం మధ్యాహ్నం మృతుడి సోదరుడు, తన సోదరుడి మృతదేహాన్ని గుర్తించడంతో అతని వివరాలు వెలుగు చూశాయి. అబుదబీలో భారతీయ వలసదారుడు జబర్ నివసిస్తున్నారు. ముస్సాఫ్పా ఇండస్ట్రియల్ ఏరియాలో అతని మృతదేహం కనుగొన్నారు. మృతుడు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొమ్మిదేళ్ళుగా అబుదాబీలో నివాసముంటున్నాడీయన. ఎవరితోనూ తన సోదరుడికి గొడవలు లేవనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని మృతుడి సోదరుడు మునీర్ చెప్పారు. మునీర్ కూడా, తన సోదరుడితోనే కలిసి అదే బ్యాంక్లో పనిచేస్తున్నాడు. మృతుడు జబార్కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతికి గల కారణాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో తెలుసుకోనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్