అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు

- July 19, 2018 , by Maagulf
అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు

మస్కట్‌:నిజ్వాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఇద్దరు ఒమనీయులున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం మరింత విస్తరించకుండా సివిల్‌ డిఫెన్స్‌ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా కాలిన గాయాలతో వారు బాధపడుతున్నారు. తక్షణ వైద్య చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com