అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- July 19, 2018మస్కట్:నిజ్వాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఇద్దరు ఒమనీయులున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం మరింత విస్తరించకుండా సివిల్ డిఫెన్స్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా కాలిన గాయాలతో వారు బాధపడుతున్నారు. తక్షణ వైద్య చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..