మరోసారి కంపించిన ఇండోనేషియా

- August 09, 2018 , by Maagulf
మరోసారి కంపించిన ఇండోనేషియా

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రభావం నుంచి తేరుకోకముందే ఈ రోజు ఉదయం లాంబోక్‌లో మళ్లీ భూమి కంపించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. నేటి భూకంపం కారణంగా వాహనాలు కింద పడిపోయాయని, కొన్ని భవనాల గోడలు కూలిపోయాయని, ప్రజలు భయంతో పరుగులు తీశారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com