బహ్రెయిన్:లాండ్రీమేన్ని దోచుకున్న మహిళ
- August 09, 2018బహ్రెయిన్:ఆసియాకి చెందిన లాండ్రీ మేన్ని ఓ అరబ్ మహిళ దోచుకుంది. అతన్ని వేధింపులకు గురిచేసి, అతని వద్దనున్న వాలెంట్ని దోచుకుంది 32 ఏళ్ళ మహిళ. ఆమె ఏడుగురు పిల్లల తల్లి. ఈ కేసు విచారణలో వుంది. ఆమెపై ప్రాస్టిట్యూషన్ అభియోగాలూ మోపబడ్డాయి. నిఖబ్ ధరించిన మహిళ, తన షాప్ వద్దకు వచ్చి, మంచి నీళ్ళు అడిగిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ గురించి రిక్వెస్ట్ చేసిందనీ, ఆ తర్వాత తనను గట్టిగా పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించి, తన వద్దనుంచి వ్యాలెట్ని దోచుకుందని, వ్యాలెట్లో 8 బహ్రెయినీ దినార్స్ వున్నాయని, ఆ తర్వాత ఆమె అక్కడినుంచి పారిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై స్పాన్సరర్కి ముందుగా తెలిపిన బాధితుడు, నిందితురాలు బలంగా వుండడంతో ఆమెను తాను నిలువరించలేకపోయానని చెప్పాడు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!