మనామా:లిక్కర్ స్మగ్లర్స్ అప్పీల్ని తిరస్కరించిన న్యాయస్థానం
- August 10, 2018మనామా:200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆల్కహాల్ని స్మగ్లింగ్ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్ చేయడానికి ముందుకు రాలేదు. షిప్లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్లోకి స్మగుల్ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్