దుబాయ్‌:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి

- August 13, 2018 , by Maagulf
దుబాయ్‌:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి

దుబాయ్‌: జబెల్‌ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్‌లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్‌ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్‌ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్‌ అలి పోలీస్‌ స్టేషన్‌ నుంచి పోలీస్‌ పెట్రోల్స్‌, అంబులెన్స్‌, ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌, క్రైమ్‌ సీన్‌ ఆఫీసర్స్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్‌లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com