మహారాష్ట్రలో బ్యాంకు దోపిడి...
- August 14, 2018తాళాలు పగలగొట్టి, బెదిరించి, కదిలారంటే కాల్చి పారేస్తాం లాంటి దొంగతనాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఆన్లైన్ దొంగతనాలు. చదువుకున్న చదువుకి ఆధునిక టెక్నాలజీని జోడించి స్మార్ట్గా దొంగతనాలు చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా మొత్తం మూటగట్టేస్తున్నారు.
మహారాష్ట్ర పూణేకు చెందిన కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్ను హ్యాక్ చేసి రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. ఈనెల 11న బ్యాంకు సర్వర్ను హ్యాక్ చేసిన నిందితులు రూ.78 కోట్లు ఖాళీ చేశారు.
అనంతరం 13న మరో సారి దాడి చేసి రూ. 14 కోట్లు నొక్కేశారు. అంతే కాకుండా నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా మొత్తం రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంకు నుంచి కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ