5 రోజుల ఈద్ మెగా సేల్: 75 శాతం డిస్కౌంట్స్
- August 14, 2018దుబాయ్:దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ వీకెండ్ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ షాపింగ్ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బిగ్ బ్రాండ్స్ ఫెస్టివల్ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్ ఈవెంట్స్లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని షేక్ మక్తౌమ్ హాల్లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. షూస్, అప్పారెల్స్, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష