దుబాయ్ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- August 14, 2018దుబాయ్:దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 47 ఏళ్ళ భారతీయుడొకరు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెల్చుకున్నారు. కేరళకు చెందిన జెఐ చాకో, జెడ్డాలోని ఓ పార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఐదేళ్ళుగా తాను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని చాకో చెప్పారు. ఐదేళ్ళుగా చాకో మిలియనియం డ్రాలో పాల్గొంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రపాలెలో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. 48 ఏళ్ళ కువైటీ జాతీయుడు నవాఫ్ మొహమ్మద్ అల్నాజ్దీ బెంట్లే కాంటినెంటల్ ఫ్లైయింగ్ స్పెర్ గెల్చుకున్నారు. దుబాయ్లో స్థిరపడ్డ భారత జాతీయుడు కారుప్పన్ చెల్లయ్య ఫ్రెడ్రిక్ రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ కారుని గెల్చుకున్నారు. మరో కేరళ వాసి పుష్పరాజ్ మునియూర్ బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ మోటర్ బైక్ని గెల్చుకున్నారు. పాకిస్తానా జతీయుడు మరూఫ్ సుమ్రో బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ మోటార్ బైక్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ