కేరళ వరద బాధితులకు యూఏఈ లీడర్స్‌ సంఘీభావం

- August 17, 2018 , by Maagulf
కేరళ వరద బాధితులకు యూఏఈ లీడర్స్‌ సంఘీభావం

యూఏఈ:ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి 'కేబుల్‌ ఆఫ్‌ కండోలెన్స్‌' పంపించారు. కేరళ రాష్ట్రంలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు నిలువ నీడ కోల్పోవడం పట్ల ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు షేక్‌ ఖలీఫా, రామ్‌నాథ్‌ కోవింద్‌కి పంపిన సంఘీభావ లేఖలో పేర్కొన్నారు. దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అలాగే యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సైతం కేరళ వరద బాధితులకు సంఘీభావం తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com