ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి..
- August 31, 2018హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి చివరకు బ్రెయిన్ స్ట్రోక్కూ దారితీస్తున్నాయి. పక్షవాతం అంటే వయస్సు పైబడిన వారికే వస్తుందని గతంలో అనుకునేవారు. కానీ, ఇపుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యుక్తవయసు వారికీ వస్తోంది. అంతేనా, మానసిక, పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యంబారిన పడుతున్నారు. ఒత్తిడి జయించి, బ్రెయిన్ స్ట్రోక్కు దూరంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
* రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు.
* రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి.
* మానసిక ఒత్తిడికిగురయ్యే పనులకు దూరంగా ఉండాలి.
* ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు.
* కూర్చుని పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
* కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి.
* నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.
* తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి.
* రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* అధిక బరువు, హైపర్టెన్షన్, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వుపదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ