గ్రూప్ వెడ్డింగ్ త్వరలో
- September 13, 2018మస్కట్: పెళ్ళి ఖర్చుల్ని భరించలేని యువతీ యువకుల కోసం అల్ సీబ్లో గ్రూఫ్ వెడ్డింగ్ని నిర్వహించబోతున్నారు. నవంబర్ 23న ఈ వివాహాలు జరుగుతాయి. సోషల్ డెవలప్మెంట్ కమిటీ - విలాయత్ ఆఫ్ సీబ్ వీటిని నిర్వహించనుంది. 20,000 నుంచి 25,000 ఒమన్ రియాల్స్ ఇందుకోసం ఖర్చు కానుంది. షురా కౌన్సిల్లో అల్ సీబ్ ప్రతినిథి హిలాల్ అల్ సర్మి ఆర్గనైజింగ్ కమిటీ హెడ్గా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పెళ్ళికొడుకు ఒమనీ సిటిజన్ అయి వుండాలి. విలాయత్ ఆఫ్ సీబ్కి తొలి ప్రయారిటీ ఇస్తారు. గ్రూమ్కి మరో భార్య వుండకూడదు. గ్యారంటీ కింద 200 ఒమన్ రియాల్స్ డిపాజిట్ చేయాల్సి వుంటుంది. గ్రూమ్స్ 50 మంది స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ని ఈ కార్యక్రమం కోసం తీసుకురావాల్సి వుంటుంది. సెప్టెంబర్ 9న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటికే 8 అప్లికేషన్లు వచ్చాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..