బోస్టన్లో 70చోట్ల పేలిన గ్యాస్ పైపులైన్లు
- September 14, 2018బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో గ్యాస్ పైపు లైన్లు వరుసగా పేలడం కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయచర్యలు చేపట్టింది. గ్యాస్ పైపులైన్లు పేలిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడగా... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాదాపు 70చోట్ల పైపులైన్లు పేలినట్లు తమకు సమాచారం అందిందని మసాచుసెట్స్ పోలీసులు వెల్లడించారు. తూర్పుతీరం ప్రాంతంలోని లారెస్స్, ఆండోవర్, ఉత్తర ఆండోవర్లో గ్యాస్ వాయువులు విస్తరించినట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు గ్యాస్ పైపులైన్లలో పీడనాన్ని తగ్గించినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలపై ఇప్పుడే చెప్పలేమని.. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్