చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట
- September 14, 2018చంద్రుని మీదకు అమెరికా వ్యోమగాములు తొలిసారి వెళ్లారు. నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ 1969లో చంద్రునిపై కాలుమోపి చరిత్రకెక్కారు. 1972లో చివరియాత్ర జరిగింది. మొత్తం 24 మంది మాత్రమే చంద్రయాత్ర చేశారు. వారంతా వ్యోమగాములుగా శిక్షణ పొందినవారు. ఆ తర్వాత, మానవరహిత రాకెట్లు మాత్రమే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్ ప్రారంభించింది. కాకలుతీరిన వ్యోమగాములేమిటి.. సామాన్యులూ చంద్రమండల యాత్ర చేసి తరించవచ్చని టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అప్పుడే ఓ టిక్కెట్ అమ్ముడైంది కూడా. ఈ యాత్ర కోసం బిగ్ ఫాల్కన్ రాకెట్ అనేదానిని తయారు చేశారు. తొలి పర్యాటకుడు ఎవరో సెప్టెంబర్ 17న ప్రకటిస్తామని టెస్లా కంపెనీ సీఈవో కూడా అయిన మస్క్ ట్విట్టర్లో తెలిపారు. అయితే ఈ యాత్రలో కేవలం చంద్రుని చుట్టూ రాకెట్లో చక్కర్లు కొట్టడమే ఉంటుంది. కిందకు దిగితే ఎదురయ్యే ఇబ్బందులు మామూలు ప్రయాణికులైతే తట్టుకోలేరని ఇలా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..