మహర్షి షూటింగ్ కి ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళనున్న మహేష్‌.!

- September 16, 2018 , by Maagulf
మహర్షి షూటింగ్ కి ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళనున్న మహేష్‌.!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధనటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మహర్షి'. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలో మరో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళనుంది. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా, అక్కడికి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నాడట. యూఎస్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com