మహర్షి షూటింగ్ కి ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళనున్న మహేష్.!
- September 16, 2018వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధనటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మహర్షి'. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలో మరో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళనుంది. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా, అక్కడికి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నాడట. యూఎస్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు