దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

- September 17, 2018 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

దుబాయ్‌లోని షేక్‌ రషీద్‌ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి గాయలయ్యాయి. వాహనం టైరు పేలి, బ్యారియర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందినవారిలో ఓ మహిళ, ఓ పురుషుడు వున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురు మహిళ కాగా, ఒకరు పురుషుడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.32 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి రషీద్‌ హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోందని అల్‌ మురాకాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అలి అహ్మద్‌ అబ్దుల్లా ఘానిమ్‌ చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించడంతోపాటు, రెగ్యులర్‌గా తమ వాహనాన్ని చెక్‌ చేస్తుండాలనీ, టైర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని బ్రిగేడియర్‌ ఘానిమ్‌ సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com